Sunday, May 3, 2009

గిద్దలూరులో ప్రదాన కుడళ్ళు -1

గిద్దలూరు లో ప్రధానంగా బద్వేల్ రోడ్ లో గాంధీ బొమ్మ ప్రాంతం బాగా ప్రదానమైనది అని చెప్పుకొనవచ్చు, దీనిని ఒకప్పుడు కస్సేట్టి వారి అంగడి అనే పేరు ఉండేది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన భవంతి ఇప్పటికి మనకు కనపడుతుంది, అలాగే కొంచెం ముందుకు వెళితే అక్కడ రాజస్థాన్ హోటల్ ఉండే ప్రాంతం కూడా బాగా పేరు పొందిందే ఇక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకు పూరి దొరుకుతుంది, ఇక ఈ ఏరియా లో ఇంకో విషయం ఏమిటంటే గురవయ్య పాన్ షాప్ ఇక్కడ ఎంతో మంచి కిల్లిలు దొరుకుతాయి అలాగే ప్రక్కనే రాజస్థాన్ స్వీట్ బళ్ళు, ప్రక్కనే సురే వాళ్ల ఎలక్ట్రానిక్ షాప్ లు, బుక్ షాప్స్ ఇంక ఈ ఏరియా లో పూల కోట్లు ఉన్నాయి. కొంచెం ముందుకు వెళితే సాయిబాబా గుడి వస్తుంది, ఇది ఉరిలో ఒక ఆద్యాత్మిక ప్రదేశం, ఇందులో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. అలా నేరుగా వెలితే కుమ్మరం కట్ట వస్తుంది , అటునుండి నంద్యాల ఒంగోలు ప్రధాన రహదారి వస్తుంది, ఎడమ వైపు నంద్యాల వెళ్ళే దారి కుడి వైపు గిద్దలూరు రైల్వే స్టేషన్ వస్తుంది, ఈ ప్రాంతం కూడా ప్రధానమైనది, గిద్దలూరు రైల్వే స్టేషన్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నెల కోట్ల లో రైల్వే ఆదాయం వస్తుంది, రైల్వే స్టేషన్ ఎదురుగ మండల రెవెన్యూ ఆఫీసు, కోర్టు, త్రేసురి ఆఫీసు, ఫైర్ ఆఫీసు, మరియు స్వామి బుక్ స్తోరేస్, జిరోక్స్ షాప్ లు ఈ ఏరియా లోనే ఉన్నాయి.

1 comment:

vasantam said...

గిద్దలూరు గురించి చాల చక్కగా వ్రాస్తున్నారు,ఇంక అక్కడి విశేషాలు ముఖ్యంగా కొండమీద స్వామి గురించి,పాతాళ నాగేశ్వర స్వామి గురించి వ్రాయండి. అభినందనలు!